దానాలు… ఆచరణ… నియమాలు - 1
హిందూ అచారా సాంప్రదాయాల్లో దాన ధర్మాలు చేయటం అన్నది పూర్వకాలం నుండి ఆనవాయితీగా వస్తుంది. మోక్ష సాధన కోసం ఒక్కోక్కరు ఒక్కో మార్గాన్ని ఎంచుకుంటారు. తనకున్న దానిలో కొంత బాగాన్ని లేని వారికి దానం చేస్తే పుణ్యం దక్కు తుందని భావిస్తారు. దాన ధర్మాలకు సంబంధించి అనేక రకాలు ఉన్నాయి. అన్నదానం, వస్త్రదానం, జలదానం, గోదానం, కన్యాదానం, సువర్ణదానం, భూదానం మొదలైనవి దానాల్లో కెల్ల విశిష్టమైనవి.
అయితే దానధర్మాలు చేయడానికి కూడా కొన్ని ప్రత్యేక నియమాలు ఉన్నాయి. ముఖ్యంగా సూర్యస్తమయం తరువాత అస్సలు దానం చేయకూడదు. ఒకవేళ అలా చేస్తే చాలా ధనం నష్టపోతారు. చాలా మంది రాత్రివేళలో పేదలకు, పొరుగువారికి పెరుగును దానం చేస్తూ ఉంటారు. అలా చేయటం ఏమాత్రం సరికాదు. సూర్యాస్తమయం తరువాత ఎట్టి పరిస్ధితుల్లో పెరుగును దానంగా ఇవ్వరాదు. పెరుగు శుక్ర గ్రహంతో సంబంధం కలిగి ఉంటుంది. శుక్రుడు మనలో సంతోషాన్ని, శ్రేయస్సును పెంచేవాడు. చీకటి పడిన తర్వాత పెరుగును దానం చేస్తే కుటుంబ జీవితంలో సంతోషం తగ్గుతుంది.
సూర్యాస్తమయం తర్వాత ఎవ్వరికీ అప్పులు ఇవ్వకూడదు. ముఖ్యంగా చీకటి పడిన తర్వాత ఎవరికైనా అప్పులు ఇస్తే ఆర్థిక సమస్యలతో సతమతమవుతారు. అలాగే రాత్రి సమ యంలో వంట చేసే సమయంలో పక్కింటి వారు ఎక్కువగా ఉల్లిపాయ, వెల్లుల్లిని అడుగు తుంటారు. అయితే ఎట్టి పరిస్ధితుల్లోనూ ఈ రెండింటిని ఇవ్వకూడదు. వీటిని అరువుగా ఇస్తే చెడు ఫలితాలతో ఇబ్బంది పడాల్సి వస్తుంది.